తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తీస్తున్న కునుకుపాట్లు అన్నీఇన్నీ కావు. నిన్నటి నుంచి నిరంతరాయంగా మహానాడు జరుగుతుండటంతో నిద్రలేకుండా నాయకులు సభలోనే తూలుతున్నారు. ప్రధానంగా ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్లు మహానాడులో నిద్రపోతూనే కనిపించారు.
మరోవైపు.. తిరుపతిలో పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పరిటాల అభిమానుల మధ్య ఆమె పుట్టినరోజు వేడుకులను చేసుకున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత నేరుగా తిరుచానూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ కేక్ చేసిన సునీత బంధువుల మధ్య వేడుకలను జరుపుకున్నారు. అధికసంఖ్యలో పరిటాల అభిమానులు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.