ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచిందనీ, అదే మన రాష్ట్రంలో టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదన్నారు.