అయితే, తల్లిదండ్రులు వ్యక్తిగత పనుల మీద సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తనకు విజయవాడలో పని ఉందని ఇక్కడే మరో రెండు రోజులు ఉంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, మంగళవారం ఉదయం కృష్ణమూర్తి ఫోన్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి సాయంత్రం ఇంటి సమీపంలోని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు.
బంధువు వెళ్లినప్పుడు గేటుకు బయట తాళం వేసి ఉంది. అనుమానంతో తాళం తీసి పై అంతస్తులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. కిటికీలోంచి చూడగా గదిలో ఉరికి వేలాడుతూ కృష్ణమూర్తి కనిపించాడు. దాంతో అతను కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.