తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విచారణ కమిటీ వేయనున్నారు. టి. రాజయ్య అవినీతికి పాల్పడ్డాడంటూ, అతనిపై విచారణ కమిటీని నియమించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వైద్య, ఆరోగ్య శాఖలో రాజయ్య అవినీతికి పాల్పడ్డాడని, ఆయన అక్రమాలను వెలికితీసేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, సదరు కమిటీ ద్వారా రాజయ్య బర్తరఫ్పై తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేటతెల్లం చేసేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.