డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన బలిదానాలకు సోనియాగాంధీయే కారణమని రాజయ్య శనివారం అసెంబ్లీలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ స్పందిస్తూ.. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.