టీడీపీలో తనకు తగిన గుర్తింపు లేదని.. అందుకే బీజేపీలో చేరనున్నట్లు నటుడు సుమన్ శుక్రవారం ప్రకటించారు. నటుడు సుమన్ తిరుమల విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, అయితే, అక్కడ తగినంత గుర్తింపు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.