టీడీపీలో గుర్తింపు లేదు.. అందుకే బీజేపీలోకి వెళ్తున్నా: సుమన్

శుక్రవారం, 21 నవంబరు 2014 (14:18 IST)
టీడీపీలో తనకు తగిన గుర్తింపు లేదని.. అందుకే బీజేపీలో చేరనున్నట్లు నటుడు సుమన్ శుక్రవారం ప్రకటించారు. నటుడు సుమన్ తిరుమల విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, అయితే, అక్కడ తగినంత గుర్తింపు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఏపీ సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరానని పేర్కొన్నారు. టీడీపీలో తన సేవలను పెద్దగా ఉపయోగించుకోవడం లేదని సుమన్ చెప్పారు. ఆహ్వానిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని సుమన్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి