తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స: మెదడులో పిండం తొలగింపు!

శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (11:05 IST)
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్‌కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్‌లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. 
 
గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు, వెంట్రుకలు, పళ్లు కూడా ఏర్పడ్డాయని డాక్టర్లు తెలిపారు. అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని వెల్లడించిన డాక్టర్లు మరో మూడు వారాల్లో యామిని కోలుకుంటుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి