హోదా ఏపీకి ఇవ్వరు కానీ...పుద్దుచ్చేరికి ఇస్తారా?: ఏపిసిసి అధ్య‌క్షుడు శైలజానాథ్

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:23 IST)
బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతి వేదికగా హోదా హామీని బీజేపీ మార్చిపోయిందా అని నిలదీశారు. హోదా ఏపీకి ఇవ్వరు కానీ ఎన్నికల కోసం పుదుచ్చేరికి ఇస్తారా అంటూ మండిపడ్డారు.

పాచి పోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీపై జగన్ మోహన్ రెడ్డి  పోరాటం చెయ్యాలన్నారు.

బీజేపీతో కలిసి పని చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు.ఉప ఎన్నికల్లో గుంపు పార్టీలు పొట్లాడుకుంటున్నాయన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు