శ్రీవారికి తప్పని దొంగల బెడద: భక్తి ముసుగులో దొంగలు!

గురువారం, 6 ఆగస్టు 2015 (10:44 IST)
భక్తులచే కాసుల వర్షం కురిపించుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కూడా దొంగల బెడద తప్పట్లేదు. శ్రీవారి నివాసం ఆనంద నిలయానికి, ఆస్తులకు, ఆయన్ని సేవించుకునే భక్తులకు రక్షణ నిమిత్తం ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుడప్పుడూ భక్తి ముసుగులో దొంగలు పడుతూనే వున్నారు. ఇలాంటి ఘటనే గురువారం ఉదయం చోటుచేసుకుంది. 
 
తిరుమలలోని ఆలయం ప్రధాన హుండీలో దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. హుండీ నుంచి రూ. 13 వేలు తీసుకుని వెళ్లిపోతున్న ఈ దొంగను సీసీ కెమెరాల్లో చూసిన విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగళూరు నుంచి వచ్చాడని తెలుస్తోంది. ఇతన్ని పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి