ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:44 IST)
ఏటీఎంను లూటీ చేయడానికి దొంగలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు వీలుకాక వదిలేశారు. ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
గ్రామంలో ఉన్న టాటా క్యాష్ ఏటీఎమ్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఏటీఎమ్ నుంచి క్యాష్ దొంగలించారా? లేదా అన్న విషయాన్ని ఏటీఎమ్ అధికారులు తెలపాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి