ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు అనంతలోకాలకు..

శనివారం, 29 ఆగస్టు 2015 (21:49 IST)
ఈత సరదా వారి ప్రాణాలను తీసింది. చిన్న పిల్లలు సరదాగా ఈత కొడుతూ చెరువులో మునిగి చనిపోయారు. విజనగరం జిల్లాలో జరిగిన విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కొత్తవలస మండలంలోని రావి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వల్ల రావిచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి