గర్భంతో ఉన్న శునకంపై యాసిడ్ పోశారు.. మూడు కుక్కల్ని విషమిచ్చి చంపేశారు..!

శనివారం, 30 జులై 2016 (09:30 IST)
గర్భంతో ఉన్న శునకంపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అంతేగాకుండా నాలుగు కుక్కల్ని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని యాప్రాల్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ కుక్కను యాసిడ్ పోసి చంపేసిన ఘటన జరిగింది. దీంతో పాటు మరో మూడు కుక్కలను విషమిచ్చి చంపారు. 
 
వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన అన్నమ్మ జోసెఫ్ నాలుగు కుక్కలకు ఆహారం పెడుతూ పెంచుకుంటుంది. జోసెఫ్ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గర్భంతో ఉన్న కుక్క ముఖంపై యాసిడ్ పోసి ఉంది. మరో మూడు కుక్కలపై విషప్రయోగం చేయడం వల్ల అవి మొరుగుతూ బాధతో విలవిల్లాడుతూ కనిపించాయి. 
 
ఎవరిపై దాడి చేయని నాలుగు కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోసి, విషమిచ్చి చంపారని అన్మమ్మ జోసెఫ్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మరణించిన కుక్కలకు పోస్టుమార్టం చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి