గర్భంతో ఉన్న శునకంపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అంతేగాకుండా నాలుగు కుక్కల్ని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని యాప్రాల్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ కుక్కను యాసిడ్ పోసి చంపేసిన ఘటన జరిగింది. దీంతో పాటు మరో మూడు కుక్కలను విషమిచ్చి చంపారు.
ఎవరిపై దాడి చేయని నాలుగు కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోసి, విషమిచ్చి చంపారని అన్మమ్మ జోసెఫ్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మరణించిన కుక్కలకు పోస్టుమార్టం చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.