కడప నగల షాపులో విషాదం: 3గురు అనుమానాస్పద మృతి!

గురువారం, 2 అక్టోబరు 2014 (15:20 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. 
 
అయితే వీరంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై యాజమాన్యం కూడా పెదవి విప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రయత్నం జరిగిందా లేదా మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి