టీ తాగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు దుర్మరణం.. ఎలా?

సోమవారం, 1 జనవరి 2024 (09:49 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలతెలవారుతుండగానే ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ముగ్గురు యువకులు టీ తాగేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్రవిషాదం నెలకొంది. జిల్లాలోని బెస్తవారి పేట మండలం, శెట్టిచెర్ల అడ్డురోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 
 
పాపాయిపల్లికి చెందిన పవన్ (20), రాహుల్ (21), శ్రీనివాస్ (21) అనే ముగ్గురు స్నేహితులు కలిసి టీ తాగేందుకు ద్విచక్రవాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా గిద్దలూరు నుంచి బెస్తవారి పేట వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు