తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు షాకిచ్చారు. అధిక సంఖ్యలో లడ్డూలు కోరుకునే భక్తులకు ఒక్కొక్కరికి ఎనిమిది లడ్డూలకు మించి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక సిఫార్సులపై 10, 20 లడ్డూ పడి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.
కాగా, సాధారణ టోకెన్లపై ప్రస్తుతం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండు లడ్డూలు, ఆపై నిల్వ లడ్డూలు అయిపోయేంత వరకూ 4 లడ్డూల చొప్పున భక్తులకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.