గాయపడిన వారిలో మధు, చిన్నారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరుపతి రుయాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. గాయపడిన వారు ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.