మెదక్ జిల్లాలో స్కూలు బస్సు నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖమంత్రి సిద్ధా రాఘవరావు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... శనివారం సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్టీవోలను ఆయన ఆదేశించారు. తెలంగాణలో జరిగిన బస్సు - రైలు ప్రమాదం తరహాలో మరో ప్రమాదం చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇందులోభాగంగానే బడి, కాలేజీ బస్సులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు ఆయన వివరించారు.