రాష్ట్రంలో పార్టీ సంస్థాగత పరిస్థితిపై ఎవరేం మాట్లాడుతున్నారో అధిష్టాన వర్గం అంతా గమనిస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెరాసకు ధీటుగా ప్రచారం చేయలేక పోయామని పొన్నాల అంగీకరించారు. తన పదవి పోతుందన్న వ్యాఖ్యలను అలా మాట్లాడిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.