అబ్బ... రాయలసీమకు, అమరావతికి కనెక్టివిటీ పెరిగింది... ఎప్పటి నుంచో కలగా మిగిలిన ఆకాశయానం ఇపుడు చెంతకు చేరింది. విజయవాడ టూ కడప.... కడప టూ విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ట్రూజెట్ ఈ ఎయిర్ సర్వీసులను ప్రారంభించింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించారు.