గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ, ఆయన అలకబూనిన సంగతి తెలిసిందే. నేతలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్పై ఒంటరి పోరాటం చేస్తున్నానని అరికెల వాపోయారు కూడా. తన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో అరికెలను టీడీపీ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.