దీంతో వ్యాను ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.