బాపట్లలో ప్రేమికుల బలవన్మరణం: పురుగుల మందు తాగి..!

శనివారం, 25 ఏప్రియల్ 2015 (17:43 IST)
ప్రేమ ఫలించలేదో ఏమో కానీ ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగులు మందు తాగి తనువు చాలించారు. కలిసి బతకలేమని తేలిపోయాక.. ఇక కలిసే చనిపోదామనుకుని ఆ ప్రేమికులు నిశ్చయించుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు, బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు భార్యాపిల్లలు ఉన్నారు. ఝాన్సీతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి