తాను దళిత బాధవుడిని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసినట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అందువల్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనకెలాంటి సంబంధం లేదనీ, అందువల్ల ఈ అంశంపై తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని... తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. బీసీలు, దళితుల తరపున తాను ఎన్నో పోరాటాలు చేశానని... తానేమిటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని ఆయన విపక్ష సభ్యులకు తెలిపారు.