ఇకపోతే.. ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. అయితే హోదా వల్ల మేలు జరుగుతుంది. అందుకే ఈ హోదాను నేనే కోరాను. ఇంతకుముందు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. వాటి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధ్యయనం చేశాక ఏ నిర్ణయం వస్తుందో చూడాలని అన్నారు.
ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో కరెంట్ కోత లేకుండా చేస్తున్నాం. ఏపీలో విద్యుత్ సమస్య తొలగిపోయింది. తెలంగాణలో ఈ సమస్య తీరాల్సి ఉంది. తెలుగు ప్రజల వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.