ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఆ బిల్లుల ఆమోదం కోసం సెప్లెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదన్నారు.
అయితే, దేశ వ్యాప్తంగా మరో 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం, పరిశ్రమలకు రాయితీలపై నీతిఆయోగ్ అధికారులతో 75 నిమిషాలు చర్చలు జరిపామన్నారు. రాష్ట్రానికి ఏవిధంగా సాయం చేయాలనే దానిపై నీతిఆయోగ్ అధికారులు నివేదికను రూపొందించి ప్రధానికి అందజేస్తారని వెంకయ్య పేర్కొన్నారు.