గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన బాబు... అధికారం చేపట్టాక చేసిన తొలి ఐదు సంతకాలను అమలు చేయకుండా అభాసుపాలు చేశారన్నారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్న విజయసాయి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో బాబు గిన్నిస్ రికార్డుకెక్కుతారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో వైసీపీ సమరదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు.