బెజవాడ దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా నియమితులు కావడమే మహాభాగ్యమని కొత్త ఈవో సీహెచ్ నర్సింగరావు అభిప్రాయపడ్డారు. అందువల్ల విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గే ప్రసక్తే లేదని, అలా నడుచుకోవడం వల్ల ఈవో పదవి ఉంటే ఉంటుంది.. ఊడితే ఊడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో తన పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో దుర్గ గుడి ఈఓగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దుర్గ గుడి ఆలయంలో రాజకీయ ఒత్తిడులు మరింత పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.