విజయవాడలో నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు!

గురువారం, 21 ఆగస్టు 2014 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో గురువారం నీలి చిత్రాల ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు విజయవాడ నగరంలోని ఓ ఇంటిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టు చప్పుడు కాకుండా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వీరిలో మతిస్థిమితంలేని బాలికతో పాటు.. రాంచరణ్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్‌ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి