ఇలాంటి ఘటనే బెజవాడలో చోటుచేసుకుంది. నగరంలోని రాజరాజేశ్వరినగర్కు చెందిన సత్యవతి అనే మహిళ ఈ సంస్థ వద్ద తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులో కాస్తంత వెనుకబడిందట. దీంతో రంగప్రవేశం చేసిన ‘సెవెన్ సిస్టర్స్’ దుర్మార్గులు ఆమె కూతురును అపహరించడమే కాకుండా ఆ బాలికను వేశ్యాగృహానికి అమ్మేశారట.