శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం చింతలబడవంజ గ్రామస్థులు మంగళవారం ఉదయం భారీ కొండచిలువను హతమార్చారు. వంశధార కుడి ప్రధాన కాలువ ద్వారా కొండ చిలువ గ్రామంలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. కొండచిలువ పొడవు సుమారు 10 అడుగుల వరకు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.