ఈ విషయం తెలుసుకుని పద్ధతి మార్చుకోవాలని సంధ్యారాణిని మందలించాడు. కానీ వారి ప్రవర్తనలో మార్పురాలేదు. దీనికి తోడు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు రాము-సంధ్యారాణి కలిసి వెళ్ళారు. అదే పెళ్లికి రాంబాబు కూడా రావడంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై కన్నేసిన రాము మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు.
అయితే రాము మత్తుగా నిద్రించాడని భావించిన సంధ్యారాణి పెరట్లో వేచి ఉన్న రాంబాబు వద్దకు వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించిన రాము గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్ళు, ముఖాలపై కసితీరా కొట్టి ప్రాణాలు తీశాడు. వారి కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూస్తే రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో ఉన్నారు. రాము పోలీసులకు లొంగిపోయాడు.