స్మార్ట్‌ఫోన్ ఆశచూపి బాలికపై అత్యాచారం చేసిన యువకుడు

మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:36 IST)
విశాఖపట్టణంలో ఓ బాలికపై మణికంఠ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్మార్ట్‌ఫోన్ ఆశచూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్టణం జిల్లా గవర జగ్గయ్యపాలెం గ్రామానికి చెందిన 16 యేళ్ళ బాలికపై అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నేశాడు. 
 
దీంతో ఆ బాలికను ఎలాగైనా వశపరుచుకోవాలన్న ఉద్దేశ్యంతో స్మార్ట్ ఫోన్ కొనిస్తానని నమ్మించి తన బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత బాలికను నరవ గ్రామ శివారుకు తీసుకువెళ్లి మణికంఠ అత్యాచారయత్నం చేశాడు. దీంతో భీతిల్లిన బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అక్కడ నుంచి తప్పించుకుంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి