అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రంగనాథ్ పెద్దకుమార్తె విజయలక్ష్మి(24)కి, నల్లగొండ జిల్లా నకిరేకల్కు చెందిన గిరిబాబుతో గత ఏడాది నవంబరులో వివాహమైంది.