ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ బుధవారం జరుగనుంది. ఈ ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు వీలుగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. చట్టప్రకారం ప్రవేశాలను మండలి చేపడుతుందని వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అడ్మిషన్లు, కౌన్సిలింగ్ను ఆపమని సుప్రీం కోర్టు పేర్కొనలేదని ఆయన చెప్పారు.
కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వస్తున్నాయని చెప్పారు. ఆగస్టు 7 నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 4న సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. ఆలస్యానికి కారణాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.