రెండు మంత్రి పదవులతో ఒరిగేదేమీ లేదు... ఏపీ హోదా కోసం వదిలేస్తాం... కేశినేని నాని

శనివారం, 30 జులై 2016 (16:12 IST)
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెదేపా రెండు మంత్రి పదవులతో తమకు ఒరిగేదేమీ లేదనీ, అవసరమైతే ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తామని తెదేపా ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయనీ, ఇంకా అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలని బిల్లులో లేదని చెప్పడంతో ఇక కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఇవ్వదని తేలిపోయింది. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా ఎంపీలను పిలిపించి చర్చిస్తున్నారు. కేంద్రంతో ఈ వ్యవహారంపై ఎలా నడుచుకోవాలన్న దానిపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
 
నా పదవిని వదిలేసేందుకు సిద్ధం.. మురళీమోహన్
రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు తాము సిద్ధమేనని తెదేపా ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి