కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆదివారం నాడు విశాఖపట్టణానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఆయన ఇక్కడకు రాబోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో సైతం మొహం చాటేసిన యువనేత, హుదూద్ బీభత్సం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు.