ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పత్తికొండ సవరమ్మ కాలనీలో చిట్టెమ్మ, దస్తగిరి అనే దంపతులు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే దస్తగిరి భార్యపై అనుమానంతో నిత్యం చిట్టెమ్మను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఫలితంగా వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పినా ఈ వివాదానికి తెరపడలేదు.