స్వైన్ ఫ్లూ.. రాజయ్యను బలిచ్చారు: దానం నాగేందర్

సోమవారం, 26 జనవరి 2015 (13:16 IST)
సీఎం కేసీఆర్‌ను, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌నేత దానం నాగేందర్‌ పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుడైన రాజయ్యను బలిచ్చారని దానం నాగేందర్‌ విమర్శించారు.
 
ఇకపోతే.. పేదప్రజల అభ్యున్నతి కోసం మేనిఫెస్టోలో లేని హమీని సైతం పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 
 
అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథాకాలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిందని, ఈ పథకాల కింద అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వెబ్దునియా పై చదవండి