తీవ్ర అనారోగ్య సమస్యలున్నా, ఎలాగోలా పుష్కర స్నానం చేయాల్సిందేనన్న గట్టి సంకల్పం వారిని పుష్కర ఘాట్ల వద్దకు తీసుకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్కు మంగళవారం ఉదయం ఓ నిండు గర్భిణీ ఇదే భావనతో పుష్కర స్నానం కోసం వచ్చేసింది.
ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిలుపై వున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పవిత్ర గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించేందుకు తనకు అనుమతివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఈ పిటీషన్ను పరిశీలనకు తీసుకుంటూనే, విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.