విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆర్.రమణమ్మ(48) ఈనెల 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లిని బతికించుకోవడానికి ఆమె ఇద్దరు కుమారులు నానా తంటాలు పడ్డారు. అయితే ఆమెకు చికిత్స అందిస్తున్న కేర్ ఆస్పత్రి వైద్యులు చాలా ప్రయత్నాలు చేసి రాత్రి బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. జీవన్ దాన్ అధికారులు రమణమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడారు. తమ తల్లి మరణించినా ఆమె అవయవాలు మరొకరికి పని వస్తాయనే ఉద్దేశ్యంతో ఆమె అవయవదానానికి అంగీకరించారు. ఆమె రెండు కిడ్నీలను విశాఖలో కేర్, అపొలో ఆస్పత్రుల్లో అవసరమున్న ఇద్దరు రోగులకు ఇచ్చేందుకు సమ్మతించారు.