రాజధాని పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నవ్యాంధ్ర రాజధానికి దివంగత నేత ఎన్టీ రామారావు పేరు పెట్టాలన్న డిమాండ్లు పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భూసేకరణ పూర్తయిన తర్వాత రాజధాని పేరుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కూడా తెలియని ప్రతిపక్ష నేత జగన్... అసెంబ్లీ సమావేశాల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వంతో చర్చించకుండానే ప్రతిపక్షం ఆందోళనకు దిగడం సరైంది కాదని సూచించారు.