రాజకీయ హత్యలపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉందని టీడీపీ నేతలు అసెంబ్లీ రచ్చ రచ్చ చేశారు. దీనిపై శుక్రవారం సభ వాయిదా పడిన అనంతరం వైకాపా చీఫ్ జగన్ సమాధానమిచ్చారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదన్నారు. సంఖ్యలది ఏముందని, మానవీయ కోణంలో చూడాలని జగన్ అన్నారు.
కాగా, ఉదయం శాసన సభలో శాంతిభద్రతల పైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీని పైన అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీలు ఒకరి పైన మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దీనికి జగన్ స్పందిస్తూ.. ఇదే సభలో టీడీపీ సభ్యులు తనను హంతకుడు అన్నారని, నరరూపరాక్షసుడు అన్నారని స్పీకర్తో చెప్పారు. తమ ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అని కూడా అన్నారన్నారు. తనను అలాంటి ఘోరమైన మాటలతో దూషించిన తర్వాత, తాను వారిని బఫూన్లు అన్నానని సమర్థించుకున్నారు.