బఫూన్లు, మాట్లాడాలంటేనే..?: సభలో ఊగిపోయిన విపక్ష నేత జగన్

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:32 IST)
అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత జగన్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. శాసన సభలో శాంతిభద్రతల పైన చర్చ జరుగుతున్న సమయంలో జగన్ ఆవేశానికి గురైయ్యారు. టీడీపీ సభ్యులు తనపై చేసిన ఆరోపణలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 
విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ 'మీలాంటి బఫూన్‌లతో మాటలు అనిపించుకుంటుంటే నాకెలా ఉంటుందంటే.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర కలకలం చెలరేగింది. 
 
మంగలికృష్ణ విపక్ష నేత జగన్‌కు తెలియదా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. దీంతో సంయమనం కోల్పోయిన జగన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. తమను బఫూన్లంటూ వ్యాఖ్యానించడంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 
 
అంతకుముందు జగన్ మాట్లాడుతూ.. మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయవ్యవస్థ దిగజారిందన్నారు. తాము హత్యా రాజకీయాలను ఇకపైనైనా కంట్రోల్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతుంటే ఒక్క మంత్రి కూడా ఆ హామీ ఇవ్వడం లేదన్నారు. చనిపోయిన వ్యక్తులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాత్రమే తాము కోరామని దానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి