బాధ్యత గల ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అసెంబ్లీని స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు తెదేపా నాయకులు జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు.