పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.
జగన్ ఆదేశాలతో కొణతాలను సంప్రదించడానికి పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొణతాల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటమే దానికి కారణం. ఏదేమైనప్పటికీ... కొణతాలను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలని జగన్ సూచించారు. అంతేకాకుండా, కొణతాల రామకృష్ణ పార్టీ వీడకుండా చూడాలని ఆయన కోరినట్టు సమాచారం.