మీట్ మిస్టర్ మోడీ... ప్రధానిని కలువనున్న జగన్

సోమవారం, 30 మార్చి 2015 (09:29 IST)
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన వివరిస్తారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు కలిగిన నష్టాలపై ఆయనతో చర్చిస్తారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధుల అంశాలను నివేదిస్తారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై ప్రధాని మోదీతో వైఎస్ జగన్ చర్చిస్తారు.
 

వెబ్దునియా పై చదవండి