పవన్ ప్యాకేజీ ఎంత.. జనసేన ధనసేనగా..?: గుడివాడ అమర్నాథ్

శుక్రవారం, 6 మార్చి 2015 (15:35 IST)
జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పైన వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు పవన్ రాజధాని ప్రాంతంలో మాట్లాడిన మాటలకు, మీడియా సమావేశానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మంత్రులను తిట్టిన పవన్.. హైదరాబాదు వెళ్లాక వైయస్సార్ పైన విమర్శలు గుప్పించారన్నారు. 
 
ఈ విమర్శలు చేయడానికి పవన్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. జనసేన పార్టీ ధనసేన పార్టీగా మారిపోయిందని విమర్శించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు వేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. తెర వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైలాగ్స్ రాస్తుంటే తెర ముందు పవన్ డైలాగ్స్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి