వైఎస్ వర్థంతి : ఒంటరినై పోయానంటూ షర్మిల ట్వీట్

గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:21 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఈసందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్. షర్మిల తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 'తాను ఒంటరిని అయ్యానని.. అయినా విజయం సాధించాలని… అవమానాలెదురైనా ఎదురీదాలని నిర్ణయం తీసుకున్నానని' భావోద్వేగ ట్వీట్ చేశారు. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని… ఎప్పుడూ ప్రేమనే పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
 
తన వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారని తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి‌పై ప్రశంసలు కురిపించారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేదని… ఈ రోజు నా కన్నీరు ఆగనంటుందని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఐ లవ్ యు నాన్న.. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ వైఎస్ షర్మిల పేర్కొంది.


 

ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD

— YS Sharmila (@realyssharmila) September 2, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు