చంద్రబాబుకు ఢిల్లీలో పలుకుబడి లేదు.. ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చారు : రోజా

శనివారం, 29 ఆగస్టు 2015 (11:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో ఏమాత్రం పలుకుబడి లేదనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైకాపా శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయంతెల్సిందే.
 
ఇందులోభాగంగా తిరుపతిలో జరిగిన వైకాపా ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మందీ మార్బలాన్ని వెంటేసుకుని ఢిల్లీ వెళ్లి, ఉత్తచేతులతో వెనక్కు వచ్చిన బాబు, ఇప్పుడు సిగ్గులేకుండా ప్యాకేజీలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం బాబుకే ఇష్టం లేనట్టుందని అన్నారు. 
 
అలాగే, ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకొని వస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు హోదా ఇవ్వడానికే ఇష్టపడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతకుమించిన ప్యాకేజీ ఇస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి