జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా ఎవరు పోరాడినా తాను మద్దతిస్తానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పోరాడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చేసినా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం వెంటే ఉన్నారని రోజా మండిపడ్డారు. తన సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని.. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని అన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు హోదా కావాలన్నారు. టిడిపి నేతలు స్వరాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదా కోసం తాకట్టు పెడుతున్నారన్నారు.